DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామం లో ఫ్లైఓవర్ నుండి రాయినిగూడెం వయా పోలేని గూడెం వెళ్లే దారి ఇరుకుగా ఇబ్బంది కరంగా ఉండటం తో గ్రామ ప్రజల ఇబ్బందులు చూడలేక గ్రామ సర్పంచ్ చల్ల గురవయ్య గారు వారి సొంత ఖర్చులతో ముత్యాలమ్మ కట్ట ను బాగు చేయించి ప్రత్యేమాన్య బై పాస్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఇకపై భారీ వాహనాలు ఊళ్ళో నుండి వెళ్లకుండా చర్యలు తీసుకుంటా అని అన్నారు. వాహన దారులు ఇట్టి విషయాన్నీ గమనించి సహకరించాలి అని కోరారు. పదవి లేనప్పుడు కూడా సుమారుగా 500 ట్రిప్పుల మట్టి గ్రామం లోని పొలాలలోకి వెళ్లే డొంకలకి సొంత ఖర్చులతో మట్టి తొలనని, అదే విధంగా ఇప్పుడు కూడా సొంత ఖర్చులతో తాత్కాలిక రోడ్డు చేయించానని అన్నారు, నిశ్వార్ధంగా పనిచేయడం వాళ్లనే గ్రామ ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించారు అని, వారి ఋణం తీర్చుకోవటానికి రెట్టింపు ఉత్సహం తో పని చేస్తానని, గ్రామ అభివృద్దే నా లక్ష్యం అని అన్నారు. కార్యక్రమం లో వార్డ్ మెంబెర్ కుమ్మరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News