Saturday, 18 April 2026 02:16:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

మాదకద్రవ్యాలపై జిల్లా పోలీసుల మెగా కార్డన్ సెర్చ్ – 52 వాహనాలు స్వాధీనం, 41 లిక్కర్ బాటిళ్లు సీజ్..

Date : 28 March 2026 05:00 PM Views : 75

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ శనివారం జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ డే” ను విస్తృతంగా నిర్వహించింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఏకే రవి కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌ల పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. పత్తికొండ సబ్ డివిజన్‌లో హోళగుంద పట్టణం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో మంత్రాలయం పట్టణం, ఆదోని సబ్ డివిజన్‌లో ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న పెండేకల్ గ్రామం, కర్నూలు సబ్ డివిజన్‌లో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలలో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 196 మంది పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా మొత్తం 350 మంది వ్యక్తులను తనిఖీ చేయగా, 50 అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. అలాగే 77 వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఉపేంద్రబాబు, సిఐలు, ఎస్సైలు, ఈగల్ టీం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :