Monday, 15 June 2026 01:54:45 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం – అక్రమ ప్రచారాలు, ముందస్తు అడ్మిషన్లపై తక్షణ చర్యల డిమాండ్...

Date : 06 May 2026 10:12 AM Views : 42

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టణంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే విద్యాసంస్థలు తమ ర్యాంకుల ప్రచారాలు చేస్తూ పట్టణంలో భారీ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని విమర్శించారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు. వీఆర్వోలను కూడా విద్యార్థుల ఇళ్లకు పంపిస్తూ అడ్మిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు పెరిగాయని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ఆందోళనలు చేపట్టి ఫ్లెక్సీలను స్వయంగా తొలగిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ స్పందిస్తూ పట్టణంలో ఉన్న అక్రమ ఫ్లెక్సీలను రెండు రోజులలోపు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :