DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గ్రామ సమస్యల పరిష్కారమే ద్వేయంగా పనిచేస్తున్నట్లు సర్పంచ్ మండవ వెంకటాద్రి అన్నారు, శనివారం మండలంలోని కలకోవ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ముగింపులో భాగంగా తన అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి, ఎంపీడీవో కుంటల రమేష్ దీన్ దయాల్, పాల్గొని మాట్లాడారు గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీల పూడిక తీత, వర్షాకాలంలో ముందస్తు సన్నద్ధత, గ్రామశుభ్రత, చెత్త తొలగింపు, వీధిలైట్ల మరమ్మత్తులు, జల సంరక్షణ కొనసంరక్షణ ఘణ వ్యర్ధాల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు, ఈకార్యక్రమంలో గ్రామ, ఉపసర్పంచ్ అమరగాని వీరభద్ర గౌడ్, పంచాయతీకార్యదర్శి కిన్నెర వీరబాబు,మండలవ్యవసాయ అధికారి బుంగ,రాజు, ఏ ఎస్సై వెంకటరత్నం,మాజీ సర్పంచ్ సిర్ర శ్రీనివాస్, జిపిఓ గోపీనాథ్, లైన్మెన్ లచ్చిరెడ్డి, గ్రామ పెద్దలు సురభి వెంకటనారాయణ, కొంపెల్లి లింగయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు,జిల్లాపరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తేజోరాం, ప్రాథమికపాఠశాల ప్రధానోపాధ్యాయురాలుమల్లేశ్వరి,అంగన్వాడీ టీచర్ బుర్రి శైలజ, ఏఎన్ఎంనాగమణి,ఆశాకార్యకర్తలు,నాగమణి, మరియమ్మ, వార్డ్ సభ్యులు పాతకోట్ల రమణ, అమరగాని వీరబాబు,బొడ్డుపల్లి సావిత్రి, సిద్దుల వీరయ్య,తిప్పని నవ్య,మామిడి నాగేంద్రబాబు, చిర్రా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు...
Admin
DNB News