DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో డ్రోన్ పెట్రోలింగ్ తో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించినట్లు ఆదోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా డ్రోన్ పెట్రోలింగ్తో పాటు విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
Admin
DNB News