DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు గారు పాల్గొని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – నవభారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన దాస్యవిమోచకుడు, స్త్రీ జనోద్ధారకుడు, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, ఆర్థిక వేత్త, విశ్వమానవుడు, మానవతామూర్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశంలోని ఉద్యోగులకు మరియు కార్మికులకు చేసిన మేలులు అనన్యం. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా, దేశంలో కార్మిక, ఉద్యోగ చట్టాల రూపశిల్పిగా కూడా పేరొందారు. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా పనిచేసిన కాలంలో ఆయన తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు: - పని గంటల తగ్గింపు: రోజుకు 12-14 గంటల పనిని 8 గంటలకు తగ్గించారు. - సమాన పనికి సమాన వేతనం: లింగ భేదం లేకుండా పురుషులకు, స్త్రీలకు సమాన వేతనం ఉండాలని మొట్టమొదటగా ప్రతిపాదించారు. - సామాజిక భద్రత: నేటి EPF మరియు ESI పథకాలకు ఆయనే పునాది వేశారు. - ప్రసూతి ప్రయోజనాలు: మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. - కనీస వేతనాల చట్టం: కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 'Minimum Wages Act' తీసుకువచ్చారు. - సెలవు సదుపాయం: జీతంతో కూడిన సెలవులను చట్టబద్ధం చేశారు. - ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలు: నిరుద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేశార�
Admin
DNB News