Saturday, 18 April 2026 02:16:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్..

Date : 15 March 2026 11:30 AM Views : 34

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా పేపర్లు కేంద్రాలకు తీసుకువెళ్లేటప్పుడు, సమాధాన పత్రాలు తరలించే సమయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో కేంద్రాల ఆవరణలో ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవకతవకలు లేదా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పోలీసు అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు ఎవరైనా పాల్పడినా, వారికి సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 112 / 100కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :