Wednesday, 17 June 2026 02:56:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని డివిజన్‌లో ముందస్తు అడ్మిషన్ల దందా ఆపాలి – లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు: డీఎస్ఎఫ్ హెచ్చరిక..

Date : 28 February 2026 11:03 AM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : DSF ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆదోని డివిజన్‌లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? లేక కేవలం కుర్చీలకే పరిమితమయ్యారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు కొనసాగితే DSF విద్యార్థి సంఘంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత విద్యాసంస్థల వద్దకే వెళ్లి నిరసనలు చేపట్టి, ఉన్నతాధికారులకు పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని DSF విద్యార్థి సంఘం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో హరి, నరసింహ, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :