DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని పలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారికి నేరుగా పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. పెన్షన్ పొందిన వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించడం వల్ల తమకు ఎంతో సౌకర్యంగా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News