DNB News - ఆంధ్రప్రదేశ్ / : జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా కోర్టు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కోర్టులతో పాటు జిల్లాలోని అన్ని కోర్టు ఆవరణాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్మనెంట్ సెక్యూరిటీ యూనిట్లు, సెక్యూరిటీ రూమ్స్, గస్తీ విధులు, ప్రవేశ–నిష్క్రమణ గేట్లు, పార్కింగ్ ప్రదేశాలపై అధికారులు ఆరా తీశారు. మంగళవారం ఫోక్సో జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా పరంగా కోర్టు ప్రాంగణంలోని నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పనితీరు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను సమీక్షించారు. కోర్టు విచారణకు హాజరయ్యే ఖైదీల భద్రతపై అవసరమైన సూచనలు చేశారు. కోర్టు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ఏఓ సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్యనాయుడు, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ పాల్గొన్నారు.
Admin
DNB News