DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది మంది ఆరాధ్యంగా బావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. కనీస అవగాహన లేకుండా వైయస్ఆర్ సీపీ పై అబద్ధాలు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో జంతువుల కొవ్వు కలిసిందనీ మాట్లాడారు. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకుని చంద్రబాబు దిగజారిపోయారు . NDDB/NDRI ఇచ్చిన రిపోర్ట్ దృష్టిలో ఉంచుకొని కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ దుర్గ గుడికి వచ్చి మెట్లు కడగాలి. హిందుత్వం పై నమ్మకం ఉంటే చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం జగన్ పై వైయస్ఆర్ సీపీ పై బురద జల్లాలనుకున్నారు. పైన వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడు ఎవరిని వదలడు. ఇప్పుడు మొహం చూపించుకోలేక కూటమి నేతలు దాక్కొని తిరుగుతున్నారు. ఎల్లో మీడియా తో మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయించాలని చూస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి లెంపలు వేసుకొని, గుంజీలు తీసి క్షమాపణలు కోరాలి. భక్తులు స్వయంగా వచ్చి కూటమి నేతలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ప్రచారాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగింది. చంద్రబాబు గతంలో అభివృద్ధి పేరుతో అనేక గుడులు కూల్చేశారు. హిందువులు అంటే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదు . జంతువుల కొవ్వు కలిసింది అని సంవత్సరం పాటు అబద్ధపు ఆరోపణలు చేశారు.
Admin
DNB News