Wednesday, 17 June 2026 02:54:44 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

₹10 లక్షల అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలి – మస్జిద్ పేరుతో తప్పుడు ప్రచారం ఆపాలి: SDPI హెచ్చరిక..

Date : 07 April 2026 10:03 AM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ₹10 లక్షల అవినీతి ఆరోపణలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అంశంపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని తరఫున కన్వీనర్ గౌస్ ఖాన్ సబ్ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణలు పారదర్శకంగా విచారణకు లోబడి నిజానిజాలు వెలుగులోకి రావడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా గంభీరంగా పరిగణించి, సంబంధిత శాఖల ద్వారా గ్రౌండ్ స్థాయి నివేదిక సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో, కొంతమంది వ్యక్తులు ఈ అంశాన్ని మళ్లించేందుకు షాహీ జామియా మస్జిద్ పేరును సోషల్ మీడియా వేదికల్లో అనవసరంగా ప్రస్తావిస్తూ, మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మస్జిద్‌పై అసత్య ప్రచారం చేయకుండా, సామాజిక సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, ఆదోని DSP కి తగిన ఆదేశాలు జారీ చేసి, మస్జిద్‌పై తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్న యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా, షాహీ జామియా మస్జిద్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ మరియు ప్రాచీన మస్జిద్‌లలో ఒకటిగా ఉన్నదని గుర్తుచేస్తూ, గత 10 సంవత్సరాలుగా నిర్వహించని మస్జిద్ ఎన్నికలను బైలాస్ ప్రకారం తక్షణమే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో SDPI ఆదోని డివిజన్ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ముఖ్యంగా కో-కన్వీనర్ సద్దామ్ హుస్సేన్ , నాసిర్, ఆసిఫ్, ఖాదర్ బాషా, నిసార్ అహ్మద్ , అలాగే అద్రభాషా తదితరులు పాల్గొన్నారు. సామాజిక శాంతి, పారదర్శక పరిపాలన మరియు మతపరమైన గౌరవాన్ని కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి... గౌస్ ఖాన్ కన్వీనర్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :