DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.7,62,897/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు, ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ – ఆదోని నియోజకవర్గానికి చెందిన మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.7,62,897/- విలువైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నదానికి ముఖ్యమంత్రి సహాయ నిధి సజీవ ఉదాహరణ అని తెలిపారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News