DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత రాజ్యాంగ రూపశిల్పి బహుముఖ ప్రజ్ఞశాలి స్వతంత్ర సమరయోధులు, భారతరత్న డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని గల కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్ర పటానికి ఆమదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి *సువ్వారి గాంధీ* గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన దళిత వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రులు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయమని,భారతదేశ ఉనికి ఉన్నంతవరకు ఆయన రాసిన రాజ్యాంగం పరిడవిల్లుతుందని ఎవరు ఎన్ని చేసినా ఆయన ఆనాడు ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేడు ఈ దేశానికి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పోతురాజు సూర్యారావు పేడాడ వైకుంఠరావు అన్నెపు సూరిబాబు పైడి విజయరమణ బొడ్డేపల్లి గోవిందరావు శ్రీనివాస్ సింహచలం గోపాలకృష్ణ వాసు బగాది నేతాజీ గురుగుబెల్లి రాజశేఖర్ సాయి సూర్యనారాయణ తేజ కిరణ్ తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News