DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్లో ఉన్న జిహ్వేశ్వర స్కూల్లో మహిళల భద్రత అంశంపై ఈ రోజు ఈజీ రైటింగ్ (వ్యాసరచన) మరియు డయాగ్రామ్స్ పోటీలు నిర్వహించబడినవి. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టడం, బాలికలు మరియు మహిళల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, స్వీయ రక్షణ చర్యలు, అత్యవసర హెల్ప్లైన్ నంబర్లు వంటి అంశాలపై చక్కటి రచనలు మరియు ఆకర్షణీయమైన చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ, ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గారు మాట్లాడుతూ మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయబడినవి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News