Monday, 15 June 2026 02:16:07 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అడ్మిషన్‌ల కోసం టీచర్లపై ఒత్తిడి – విద్యార్థి సంఘాల ఆగ్రహం..

Date : 06 May 2026 10:16 AM Views : 35

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలోని భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నియమ నిబంధనలను పూర్తిగా విస్మరించి, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై విద్యార్థుల అడ్మిషన్‌లు తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనకు బదులుగా అడ్మిషన్‌ల కోసం ఉపయోగించడం విద్యా వ్యవస్థను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ పరిస్థితిని వెంటనే ఆపాలని, సంబంధిత విద్యాసంస్థలపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ని కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులను అడ్డుకున్న ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ చర్యను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, భాష్యం, చైతన్య నారాయణ, విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :