DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోనిలో పాత బ్రిడ్జి వద్ద ఉన్న డివైడర్ను తొలగించి, శ్రీనివాస భవన్, బంగారు బజారు, దాదా సోడ షాపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. భీమాస్ మరియు కంట్రోల్ రూం వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ప్రజలకు సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, అందువల్ల ఆ రెండు చోట్ల సిగ్నల్స్ను తొలగించాలని నూర్ అహమ్మద్ విజ్ఞప్తి చేశారు. ఆదోనిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని, పట్టణ మాస్టర్ ప్లాన్ను అమలు చేసి రోడ్ల విస్తరణ చేపడితేనే సమస్య కొంతమేరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరిట ఉన్న సిగ్నల్స్ను మరమ్మతులు చేయకుండా తొలగించి, రూ.36 లక్షల వ్యయంతో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంలో అవినీతి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నూర్ అహమ్మద్ అన్నారు. ఈ విషయంపై ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మరియు ఉన్నతాధికారులు విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు షకీల్, విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News