Saturday, 18 April 2026 05:57:49 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఆదోని ట్రాఫిక్ సిగ్నల్స్ అవినీతి పై విచారణ జరపాలి- నూర్ డిమాండ్...

Date : 02 February 2026 11:39 AM Views : 97

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోనిలో పాత బ్రిడ్జి వద్ద ఉన్న డివైడర్‌ను తొలగించి, శ్రీనివాస భవన్, బంగారు బజారు, దాదా సోడ షాపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. భీమాస్ మరియు కంట్రోల్ రూం వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ప్రజలకు సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, అందువల్ల ఆ రెండు చోట్ల సిగ్నల్స్‌ను తొలగించాలని నూర్ అహమ్మద్ విజ్ఞప్తి చేశారు. ఆదోనిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని, పట్టణ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసి రోడ్ల విస్తరణ చేపడితేనే సమస్య కొంతమేరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరిట ఉన్న సిగ్నల్స్‌ను మరమ్మతులు చేయకుండా తొలగించి, రూ.36 లక్షల వ్యయంతో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంలో అవినీతి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నూర్ అహమ్మద్ అన్నారు. ఈ విషయంపై ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మరియు ఉన్నతాధికారులు విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు షకీల్, విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :