DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని మరాటివాడిలో ఉన్న మస్తాన్ వలి దర్గాహ ప్రాంగణంలో ఈరోజు మహిళల భద్రత మరియు IVRS కాల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, అత్యవసర సమయంలో పోలీసులకు ఎలా సమాచారమివ్వాలి, IVRS కాల్స్ ప్రాముఖ్యత, వాటికి స్పందించే విధానం వంటి అంశాలపై వివరించారు. పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలు, మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న సహాయ నంబర్ల గురించి కూడా తెలియజేశారు. మొత్తం 54 మంది స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Admin
DNB News