DNB News - ఆంధ్రప్రదేశ్ / : మార్చి 23న జరగనున్న “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు పులి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కౌతళంలో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతుల పనిగంటలు పెంచుతూ జీతాలు, బత్యాలు తగ్గించే విధంగా అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలో హమాలీల పాత్ర కీలకమని, వారి హక్కులను కాపాడేందుకు లేబర్ కోడ్ల రద్దు అత్యవసరమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు పులి సంఘం జిల్లా అధ్యక్షుడు కే. జగదీష్, ఖాదర్బాషా, వీరేష్, భాష, చంద్ర, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News