DNB News - ఆంధ్రప్రదేశ్ / : న్యాయవాదుల భద్రత కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అందించాలని కోరుతూ ఈ రోజు న్యాయవాదులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో విజయ భాస్కర్ రెడ్డి, సునీతా రెడ్డి, మధు, విష్ణు, మస్తాన్, గిరి, శేఖర్, వెంకటేష్, బంగారయ్య, షానవాజ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Admin
DNB News