DNB News - ఆంధ్రప్రదేశ్ / : యుద్ధ ప్రాతిపదికన వెంటనే రైతుల వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ అన్నారు.. గత నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి ధాన్యం కొనుగోలు చేస్తలేరని నిరసన తెలుపుతూ వేములవాడ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎర్రటి ఎండలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న అధికారులకు కనబడత లేదా అని అన్నారు.. మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రేగుల శ్రీకాంత్ , హనుమాన్లు, వాసం మల్లేశం , లక్ష్మీరాజ్యం, రాహుల్, తదితరులు పాల్గొన్నారు..
Admin
DNB News