DNB News - ఆంధ్రప్రదేశ్ / : కోసిగి పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు పురోగతిపై కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులతో పాటు పాత గ్రేవ్ కేసులను కూడా సమీక్షించారు. నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా సైబర్ నేరాలు, మహిళా చట్టాలు మరియు నూతన చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్సై రమేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News