Tuesday, 28 April 2026 02:59:32 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

Date : 27 April 2026 06:26 PM Views : 35

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 121 ఫిర్యాదులు స్వీకరించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. అందిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాముఖ్యతతో తీసుకుని సంబంధిత పోలీసు అధికారులతో వెంటనే స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో ఉద్యోగ మోసాలు, ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, బెదిరింపులు వంటి పలు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ కేసులు, కుటుంబ సమస్యలు వంటి అంశాలపై బాధితులు ఫిర్యాదులు చేశారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివ శంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :