Saturday, 18 April 2026 02:14:23 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

రాష్ట్రస్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారుల ప్రతిభ – ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందనలు..

Date : 02 April 2026 05:18 PM Views : 52

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రస్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ SAP లీగ్ మాస్టర్స్ క్రీడల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్న ఆర్‌ఎస్సై మరియు కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మార్చి 30, 31 తేదీలలో 35–45 సంవత్సరాల వయస్సు విభాగంలో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్ పతకాలు సాధించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విజేతలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన మెడల్స్ మరియు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. పోలీసు విధుల్లో ఒత్తిడి మధ్య కూడా క్రీడల్లో రాణించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించారు. గత ఐదేళ్లుగా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటూ చెన్నై నేషనల్ మీట్‌లలో కూడా ప్రతిభ కనబరిచారు. కానిస్టేబుల్ శివకుమార్ (కర్నూలు ట్రాఫిక్ పీఎస్) లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. గతంలో సౌత్ జోన్ నేషనల్స్, కేరళ జూనియర్స్ నేషనల్స్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటారు. వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :