Wednesday, 17 June 2026 01:51:08 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహిళల భద్రత మనందరి బాధ్యత : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్.. ఎమ్మిగనూరులో “మీ రక్షణ - మా బాధ్యత” అవగాహన కార్యక్రమం..

Date : 21 May 2026 11:27 AM Views : 25

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల రక్షణ మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో శ్రీ గుంటెప్ప స్వామి దేవాలయం సమీపంలో బుధవారం “మీ రక్షణ - మా బాధ్యత” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు, సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో లేదా సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న “శక్తి యాప్”ను మహిళలు వినియోగించుకోవాలని సూచించిన ఎస్పీ, అత్యవసర పరిస్థితుల్లో 112, 100, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయరాదని తెలిపారు. ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీమతి భార్గవి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై వేధింపులు లేదా బాల్య వివాహాల సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కె. గంగి రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నరసింహులు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మహేష్, ఎస్సైలు, గ్రామ మరియు వార్డు సచివాలయ మహిళా పోలీసులు, పోదుపు సంఘాల మహిళలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :