DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్లో స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు *రేపు తేదీ:31-01-2036(శనివారం) ఉదయం 9.00 గంటలకు ఆమదాలవలస పట్టణంలో లక్ష్మి టాకీస్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ *తిరుమలలో ఘోర అపచారాలు - పరిహార పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఆమదాలవలస నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డ్ ఇంచార్జి లు, మండల అనుబంధ విభాగాల నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనవలసిందిగా నమస్కరిస్తూ కోరుచున్నాను. సమయం: 31-01-2026, ఉదయం 9 గంటలకు వేదిక: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఆమదాలవలస ...చింతాడ రవికుమార్
Admin
DNB News