DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ నగర్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు పార్కులు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటడం చేపట్టాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఆముదాలవలసలో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
Admin
DNB News