DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలంలోని అరేకల్ గురుకులంలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాల నివారణ, మహిళల రక్షణ, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని డీఎస్పీ హేమాలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, అటువంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థినులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర సేవల కోసం డయల్ 112, పిల్లల సహాయానికి 1098, సైబర్ మోసాలపై ఫిర్యాదుల కోసం 1930 నంబర్ల గురించి వివరించారు. రహదారి భద్రతలో భాగంగా బైకు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ మంజుల, శక్తి టీం సిబ్బంది మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టేబుల్ నాగరాజ్, మల్లప్ప, బాల భాస్కర్, తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంకటేష్, భూ చంద్ర కాసిలింగతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల రక్షణ, బాల్యవివాహాల నివారణలో సమాజం మొత్తం సహకరించాలని డీఎస్పీ హేమాలత కోరారు.
Admin
DNB News