DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ జనరల్ యునాని ఆసుపత్రి (GUH)లో మందులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇన్చార్జి వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు కడప నుంచి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నాగముని నాయక్ ఆదోని ప్రభుత్వ యునాని ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి విచారణ నిర్వహించారు. అనంతరం బాధితులకు అవసరమైన మందులు అందేలా చర్యలు చేపట్టారు. మందులు ఉన్నప్పటికీ రోగులకు అందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇన్చార్జి వైద్యురాలిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించి తగిన చర్యలు తీసుకుంటామని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. బాధితుడు రంగన్న మాట్లాడుతూ తన సమస్యను ఎస్ఎఫ్ఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేలా కృషి చేశారని, తనకు అండగా నిలిచిన ఎస్ఎఫ్ఐ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News