DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) విధానంలో చేపట్టిన పంటల సాగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు మోహన్కు చెందిన పొలంలో పీఎండీఎస్ విధానంలో విత్తనాలు చల్లి సాగు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభానికి ముందే చేపట్టే పీఎండీఎస్ విధానం ద్వారా తేమను సమర్థంగా వినియోగించుకోవచ్చని, రైతులు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడడంతో పాటు రసాయన వ్యయాలను తగ్గించవచ్చన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ, రైతులు ఆధునిక మరియు ప్రకృతి అనుకూల సాగు పద్ధతులను అవలంబించి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Admin
DNB News