DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఆదోని 2 టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై జి. రామ్ నాథ్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే… వెంకటాద్రి (S/o రంగప్ప, వయస్సు 50 సంవత్సరాలు), జీనం వండ్లపల్లి గ్రామం, గోరంట్ల మండలం, సత్యసాయి జిల్లా నివాసి మద్యం సేవించి వాహనం నడిపినందుకు కేసు నమోదు చేయగా, ఆదోని I అడిషనల్ జేఎఫ్సిఎం కోర్టు ఆయనకు 20 రోజుల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా చాకలి నాగేంద్ర (S/o బాలు), పెరవలి గ్రామం, అనంతపురం జిల్లా నివాసికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు ముద్దాయిలను తేదీ: 09.02.2026 నాడు ఆదోని సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకు ముప్పు అని, ఇలాంటి చర్యలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని పోలీసులు హెచ్చరించారు.
Admin
DNB News