DNB News - ఆంధ్రప్రదేశ్ / : అలసందగుత్తి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ “బాల్య వివాహాలు వద్దు – బాలికల చదువు ముఖ్యం” అని పేర్కొన్నారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి స్వయం సమృద్ధి సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఓటీపీలు, నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం 112 హెల్ప్లైన్, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్లను వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి , సీఐ నల్లప్ప, ఎస్ఐలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News