Saturday, 18 April 2026 02:17:15 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ఆదోని ఇండోర్ స్టేడియం పనులు వెంటనే పూర్తి చేయాలి – SFI డిమాండ్..

Date : 10 April 2026 04:16 PM Views : 31

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ, 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విట్టా కిష్టప్ప నగర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని చెప్పారు. అయితే, గత ఐదేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయి, మొండి గోడలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్థానిక క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయిన ఈ స్టేడియం మిగిలిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు వెలుగొందుతున్నారని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పందించి పనులను వేగవంతం చేయాలని కోరారు. లేకపోతే, SFI ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :