DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా రాజేష్ తలే, ముఖ్య నాయకులు. రాజాం, విజయనగరం జిల్లా దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ABNలో కొత్త పలుకు పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని, పార్టీని ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను *నీచ, నికృష్టమైన భాషతో దూషించిన వైనం మీ అందరికీ తెలిసిందే, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగ, మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే నేతృత్వంలో ముఖ్య అతిథిలుగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ పరిశీలకులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్ మోహన్ రావు,నాలుగు మండలాలు చెందిన ముఖ్య నాయకులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పలుకులకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాధాకృష్ణ ను అరెస్టు చేయాలంటూ రాజాం పట్టణంలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని.. సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.కేసు నమోదు చేసి రసీదు ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం డా.రాజేష్ తలే మీడియా ముఖంగా మాట్లాడుతూ.. మావిగన్ (MAVIGUN)కు భయపడి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రజ్యోతిలో తొలి పలుకులు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై నాయకులపై అసభ్య పదజాలం వాడిన రాధాకృష్ణకు తొందర్లోనే తగిన బుద్ధి చెప్తాం అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడము హేయనీయని.. మహిళ లోకం తలదించుకునే విధంగా రోత రాతలు రాస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన దూయ్యిబట్టారు. రాష్ట్ర ప్రజలు మహిళలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు అక్రమాలకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ రాధాకృష్ణ వంతపడే క్రమంలోనే ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీపీలు , జడ్పిటిసిలు,రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News