Monday, 15 June 2026 01:43:02 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు ,లక్ష్యాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం...

Date : 02 March 2026 05:49 PM Views : 64

DNB News - ఆంధ్రప్రదేశ్ / : *జనసేనపార్టీ ఉద్యమి సభ్యత్వం – నవశకానికి నాంది, జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పేర్కొన్నారు, జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు , లక్ష్యాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసంమని, యస్సీ, యష్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపటమే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నారని , భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత నిజాయితీ పరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఏకైక నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని ,జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాఅధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు,శ్రీకాకుళం నగర పరిధిలోని హయతీనగరం 43వ డివిజన్‌లో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 43వ డివిజన్ ఇంచార్జ్ కొండ్రు వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ , జనసేనపార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్ కొరికాన రవికుమార్, ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, ప్రముఖ వైద్యులు మరియు జనసేనపార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త డాక్టర్ దానేటి శ్రీధర్ లు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహిస్తున్న సభ్యత్వ కార్యక్రమం ద్వారా మనం కేవలం సభ్యులను నమోదు చేయడం కాదు, సమాజంలో మార్పు కోసం ముందుకు వచ్చే శక్తిని నిర్మిస్తున్నాం అని తెలియజేసారు. ఉద్యమి సభ్యత్వం తీసుకునే ప్రతి వ్యక్తి సమస్యలపై స్పందించే బాధ్యత గల పౌరుడిగా మారాలి. మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కొక్కరం కట్టుబడి పని చేయాలి” అని అన్నారు. అలాగే ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి కుటుంబం జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గురు ప్రసాద్, కొండా ఉదయ్, మామిడి విష్ణు, వాడవలస సురేష్ కుమార్ ,బొట్ట శంకర్ యాదవ్,రఫీ ,తదితరులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :