DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. టిడిపి నేత ఉమాపతి నాయుడు భవనం పక్కన కొందరు ఆకతాయిలు అగ్గి అంటించడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్.ఐ) మరియు ఇబ్రహీం ఘటనాస్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకున్న అగ్నిమాపక శాఖ మరియు పోలీసు అధికారులకు 5వ వార్డు టిడిపి ఇంచార్జ్ అమర్ ప్రకాష్తో పాటు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News