DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. టీజీ భరత్ ఒత్తిడితో రేడియో స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ వేర్హౌస్ గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని ప్రైవేట్ పాన్య రూరల్ (వాసవి) గోడౌన్లకు తరలిస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. దీని వల్ల గత 50 ఏళ్లుగా ఏపీ స్టేట్ వేర్హౌస్లలో పనిచేస్తున్న 116 మంది హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ గోడౌన్లలో రేషన్ బియ్యం ఉంటే లోడింగ్–అన్లోడింగ్పై పర్యవేక్షణ ఉంటుందని, ప్రైవేట్ గోడౌన్లకు తరలిస్తే రేషన్ మాఫియాకు అక్రమాలకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కరోనా కాలంలో ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు సరుకులు అందించిన కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. వెంటనే ప్రభుత్వ గోడౌన్ల నుంచే సివిల్ సప్లై పాయింట్లకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని, ప్రైవేట్ గోడౌన్లకు తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Admin
DNB News