DNB News - ఆంధ్రప్రదేశ్ / : గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా వెంటనే సరఫరా చేయాలని, కృత్రిమ కొరత సృష్టిస్తూ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్ మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్ చేసిన తరువాత 15 నుండి 20 రోజులైనా సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సింగిల్ సిలిండర్ కలిగిన పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వంట చెరుకు కూడా దొరకకపోవడంతో ప్రజలు పస్తులుండే పరిస్థితి ఏర్పడుతోందని, గ్యాస్ కొరత కారణంగా చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి, సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తూ లాభాలు పొందుతున్నాయని ఆరోపించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Admin
DNB News