Monday, 15 June 2026 02:22:39 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

టిడ్కో గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు వేగం.. కమిషనర్ చల్లా ఓబులేష్..

Date : 15 May 2026 11:54 AM Views : 29

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగర శివార్లలో నిర్మితమైన టిడ్కో గృహాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం ఆయన టిడ్కో, మున్సిపల్ అధికారులతో కలిసి టిడ్కో గృహాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా గృహాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, రేషన్ బియ్యం సరఫరా, సచివాలయం ఏర్పాటు, బస్సు సౌకర్యం, ప్రాథమిక పాఠశాల వంటి అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి రెండు సార్లు నీటి సరఫరా జరుగుతోందని, త్వరలోనే విద్యుత్ దీపాలకు మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. ఈ నెలాఖరుకు 500 గృహాలు అందుబాటులోకి వస్తాయని, మరో రెండు నెలల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా పూర్తవుతుందని వెల్లడించారు. టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్లలోకి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, టిడ్కో ఎస్ఈ పి.వి. శేషసాయి, ఎంఈ సూర్యనారాయణ, ఏఈ జనార్ధన్, టిడ్కో అధికారులు పెంచలయ్య, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :