DNB News - ఆంధ్రప్రదేశ్ / : MRPS ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 104వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదోని ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు డిస్ట్రిక్ట్ పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని పేర్కొంటూ, ఆదోని జిల్లా కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ ఉద్యమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని వారు కోరారు. రైతుల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం, ఉన్నత విద్య పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు, ఐదు నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యల పరిష్కారం, ఆదోని పట్టణ రోడ్ల విస్తరణ వంటి అంశాల దృష్ట్యా ఆదోనిని జిల్లాగా ప్రకటించడం అత్యవసరమని జేఏసీ నాయకులు తెలిపారు. 104వ రోజు రిలే నిరాహార దీక్షలో ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ, పిఎస్ వీరేష్ మాదిగ, దత్తు మాదిగలతో పాటు జిల్లా సాధన జేఏసీ నాయకులు షకీల్ దీక్షలో కూర్చొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జేఏసీ నాయకులు పగడాల కోదండ, బండారి హనుమంతు మాదిగ, గమ్మల బాలస్వామి మాదిగ, వై.పి. నాగరాజు, దాసరి గోవిందు, దాసరి నరేష్, కుమార్, వైఎస్ఆర్ నగర్ రామకృష్ణ, నరేష్ యాదవ్, సుజ్ఞానమ్మ, సుభాష్, రామలింగయ్య (బీఎస్పీ) తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News