DNB News - ఆంధ్రప్రదేశ్ / : పేద కుటుంబానికి అండగా నిలుస్తూ ఆదోని నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు ఈరోజు (26-03-2026) ఆదోని మండలం బసరకోడు గ్రామానికి చెందిన శివకుమార్ వివాహానికి హాజరైన ఆయన, తన వంతు సహాయంగా తాళిబొట్టు మరియు కాలిమెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదింటి బిడ్డ పెళ్లి సంతోషంగా, గౌరవంగా జరగాలని కోరుకోవడం తమ కుటుంబ సంప్రదాయమని తెలిపారు. అవసరమైనప్పుడు పేదలకు తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన అందించిన సహాయానికి శివకుమార్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News