DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 24న జరగనున్న ఐదు నియోజకవర్గాల బంద్కు తాము పూర్తి మద్దతు ఇస్తామని, బంద్లో పాల్గొంటామని పత్తికొండ మాజీ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి ప్రకటించారు. ఈ సందర్భంగా నేడు జేఏసి నాయకులు నూర్ తదితరులు పత్తికొండలో శ్రీదేవి నివాసానికి వెళ్లి బంద్కు మద్దతు కోరగా, ఆమె సానుకూలంగా స్పందించడం హర్షణీయమని తెలిపారు. డెబ్బై రోజులుగా ఆదోని జిల్లా కోసం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలించకపోవడం శోచనీయమని ఆమె అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆదోని జిల్లా ఏర్పాటు చేసి ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్, అయ్యాళప్ప, షకీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News