DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలులోని డిఐజీ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ డిఐజీ కోయ ప్రవీణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలు మరియు పార్టీ కార్యక్రమాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారు చర్చించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ, పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తామని గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు బలోపేతం కావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిఐజీని కోరారు.
Admin
DNB News