DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (పియుసి) చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు నేడు కొత్తూరు మండలంలోని నేరడి గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) విభాగం ద్వారా వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2,20,000/- చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కూన రవికుమార్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వ సహాయ పథకాలు ఎంతో ఉపయోగం గా ఉంటాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా తమ వంతు కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. CMRF సహాయం అందడంతో శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసమయాల్లో అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Admin
DNB News