DNB News - ఆంధ్రప్రదేశ్ / : జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు శ్రీ హుస్సేన్ పీరా, శ్రీ కృష్ణ మోహన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి కవాతును పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, అతిథుల గ్యాలరీలు, స్టాల్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీలు, అతిథులు, ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్, రాకపోకల నియంత్రణపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్, ఏఆర్, హోంగార్డులు, ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. — జిల్లా పోలీసు కార్యాలయం,
Admin
DNB News