DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం* . అనంతరం సత్య సాయి జిల్లా SP సతీష్ కుమార్ తో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం భేటీ . ఈ హత్యపై కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పలు ప్రశ్నలను లేవనెత్తారు. కేసును త్వరగా చేధిస్తామన్న ఎస్పి , దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హామీ. గుడిబండ మండలం, మంద పల్లి గ్రామంలో ఈ నెల 22 న విజయభాస్కర్ అనే మాదిగ యువకుడు మరణించడం జరిగింది. విజయ భాస్కర్ కుటుంబ సభ్యులు, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు మా కొడుకును పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే MRPS, MSP జాతీయ, రాష్ట్ర నాయకత్వం బాధిత కుటుంబాన్నీ పరామర్శించడం తో పాటు ఘటన జరిగిన వివరాలను నిజ నిర్ధారణ బృందం అడిగితెలుసుకోవడం జరిగింది. ఇదే అంశంపై మడకశిర శాసనసభ్యులు MS రాజు తో చర్చించడం జరిగింది. హత్య కాబడ్డ విజయ భాస్కర్ కుటుంబ ఈరోజు పరామర్శించినట్లు తెలియజేశారు. ఈ కేసు నిజమని తెలితే దోషులను శిక్షించేందుకు వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఇది అంశంపై ఘటన జరిగిన రోజే జిల్లా SP తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ అంశంపై ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. హత్యకు గురికాబడ్డ విజయ భాస్కర్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబం కావడం వలన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందిస్తూ , ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్ష రూపాయలు సహాయం చేసినట్లు తెలిపారు.
Admin
DNB News