DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేవనకొండ మండలం తెన్నేకల్లు గ్రామంలో మహర్షి వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ , ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి , మాధవరం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి , జనసేన ఆలూరు ఇన్చార్జ్ వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహర్షి వాల్మీకి సమాజానికి ధర్మం, న్యాయం, సత్యం మార్గాన్ని చూపిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దిక్సూచి లాంటి మహాగ్రంథమని తెలిపారు. వాల్మీకి మహర్షి చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో ఐక్యత, న్యాయం, ధర్మం విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ , రామ్ భీం నాయుడు, లక్ష్మన్న, మారెళ్ళ అంజి, మల్లికార్జున, కప్పట్రాళ్ల మల్లికార్జున, సర్పంచ్ భాస్కర్ నాయుడు, రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
DNB News