DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఇంటి స్థలాల కోసం రూ.2100/- డీడీ చెల్లించినప్పటికీ ఇప్పటికీ ఇంటి పట్టాలు ఇవ్వని లబ్ధిదారులకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ Communist Party of India (Marxist) (సిపిఎం) ఆధ్వర్యంలో సోమవారం ఆదోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజల నుండి డీడీ రూపంలో డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడిచినా పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ బాబు కి అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ నగర్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News