DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, తనిఖీలు చేపడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రాత్రి గస్తీ, తనిఖీలు, అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చెకింగ్లు, “స్టాప్ & వాచ్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాహనదారులకు భద్రతా సూచనలు తెలియజేశారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
Admin
DNB News