DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను ఈరోజు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి బెట్టింగ్ కొనసాగించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై పి.డి చట్టం అమలు చేయడంతో పాటు, ఆ అక్రమ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేయబడతాయని తెలిపారు. అదనంగా, వారి బ్యాంకు ఖాతాలు కూడా నిలిపివేయబడతాయని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్కు సహకరించే వ్యక్తులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతి భద్రతలకు సహకరించాలని పిలుపునిచ్చారు. – పి. చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆదోని వన్ టౌన్ పిఎస్
Admin
DNB News